Advertisement

  • కడప జైల్లో 317 మందికి కరోనా పాజిటివ్ వీరిలో తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా

కడప జైల్లో 317 మందికి కరోనా పాజిటివ్ వీరిలో తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా

By: chandrasekar Wed, 19 Aug 2020 4:16 PM

కడప జైల్లో 317 మందికి కరోనా పాజిటివ్ వీరిలో తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా


కడప జైల్లో 317 మందికి కరోనా పాజిటివ్ వీరిలో తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వున్నారు. తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జైల్లో ఉన్నారు. కడప జైల్లో ఉన్న ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో 317 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో 303 మంది ఖైదీలు కాగా, 14 మంది జైలు సిబ్బందని తెలిసింది. వీరిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరని తెలుస్తోంది.

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించారనే కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మీద విడుదలై వస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, జనంతో భారీగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే ర్యాలీ సమయంలో దళిత పోలీసు అధికారిని దూషించిన కేసులో ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత రెండు రోజుల క్రితం ఆయన్ను కడప జైలుకు తరలించారు. కడప జైల్లో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 317 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇంత అధిక స్థాయిలో కేసులు నమోదవడంతో జైలులో ఉంటున్న ఖైదీలు, అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందర్నీ జైల్లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే జైల్లో ఉన్న ఖైదీలందరికీ కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే జైల్లోనే ఉన్న వీళ్లకు కరోనా ఎలా వచ్చింది? బంధువులు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ల ద్వారా ఏమైనా వచ్చిందా? లేదా పోలీసు డిపార్ట్‌మెంట్ ద్వారా సోకిందా? అనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా ప్రబలకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement