మహారాష్ట్రలో 298 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్
By: chandrasekar Thu, 09 July 2020 11:12 AM
మహారాష్ట్రలో కరోనా
రోజురోజుకూ విజృంభిస్తోంది. గత 48 గంటల్లో ఆ రాష్ట్రంలోని 298 మంది
పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ
మహమ్మారి బారిన పడిన పోలీసుల సంఖ్య 5,713కు చేరుకుంది.
ప్రస్తుతం ఇందులో 1,113
యాక్టివ్ కేసులున్నాయి. 4,275 మంది కోలుకున్నారు.
71మంది
సిబ్బంది మృతిచెందారు. మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,17,121గా ఉంది. వీటిలో 89,313 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 1,18,558 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకూ 9,250 మంది
మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశవిదేశాల్లో లాక్ డౌన్
విధించడంతో పాఠశాలలు మొదలుకొని అన్నివ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడిపోయాయి. రోజులు, నెలలు
గడుస్తున్నా తెరుచుకోవడంలేదు.
Tags :
corona |
positive |