బెంగళూరులో మెట్రో సిబ్బంది 28 మందికి కరోనా పాజిటివ్
By: chandrasekar Thu, 01 Oct 2020 12:30 PM
కరోనా లాక్డౌన్ తరువాత బెంగళూరులో సెప్టెంబరు 7 నుంచి మెట్రో సేవలు
ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది
మెట్రో సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
బెంగళూరు మెట్రో రైల్
కార్పొరేషన్ లిమిటెడ్ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. కరోనా బారిన
పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు.
కరోనాను కట్టడి చేసే
ఉద్దేశంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు.
ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు ప్రారంభంకాగా, అక్టోబర్
4 నుంచి
కోల్కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా కోల్కతా
మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా- కవి సుభాష్ స్టేషన్ల మధ్య
మెట్రోసేవలు ప్రారంభమవుతాయిని పేర్కొన్నారు.