Advertisement

  • బెంగళూరులో మెట్రో సిబ్బంది 28 మందికి కరోనా పాజిటివ్

బెంగళూరులో మెట్రో సిబ్బంది 28 మందికి కరోనా పాజిటివ్

By: chandrasekar Thu, 01 Oct 2020 12:30 PM

బెంగళూరులో మెట్రో సిబ్బంది 28 మందికి కరోనా పాజిటివ్


కరోనా లాక్‌డౌన్ తరువాత బెంగళూరులో సెప్టెంబరు 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. కరోనా బారిన పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు.

కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు. ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు ప్రారంభంకాగా, అక్టోబర్ 4 నుంచి కోల్‌కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా- కవి సుభాష్ స్టేషన్‌ల మధ్య మెట్రోసేవలు ప్రారంభమవుతాయిని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement