Advertisement

  • ఉస్మానియాలో 12 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

ఉస్మానియాలో 12 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

By: chandrasekar Wed, 03 June 2020 3:08 PM

ఉస్మానియాలో 12 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్


ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం మొదలైనది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసిస్తోన్న 12 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓ పీజీ విద్యార్థికి ముందుగా కరోనా సోకినట్లు తేలడంతో అతడితో కాంటాక్ట్‌లో ఉన్నవారికి టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం రీడింగ్ రూంను మూసేయడంతోపాటు ఉస్మానియా హాస్టల్‌లో ఉన్న 296 మంది టెస్టులు చేశారు. వీరిలో 180 మంది అమ్మాయిలు ఉండగా 116 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి రిపోర్టులు బుధవారం వచ్చే అవకాశం ఉంది. కరోనా సోకినా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిళకళ తెలిపారు. వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

తరగతి గదులు, ప్రయోగ శాలలను శానిటైజ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. జూన్ 20 నుంచి మెడికల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఓ వైపు కరోనా విస్తరిస్తోన్న వేళ ఇప్పటికే కొందరు ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు కాబట్టి పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు ఆశిస్తున్నారు.

Tags :
|

Advertisement