రాజమండ్రి జైలులో మళ్ళీ 10 మందికి కరోనా పాజిటివ్
By: chandrasekar Thu, 06 Aug 2020 8:20 PM
రాజమండ్రి సెంట్రల్
జైలులో తాజాగా మళ్ళీ 10
మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు సెంట్రల్
జైలు లో 52 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
సెంట్రల్ జైలులో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది
సిబ్బంది ఉండగా జైలులో ఉన్న 28 మంది ఖైదీలకు, 24 మంది
జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న కొంత మంది అనుమానితులకు కరోనా
పరక్షలు జరపగా కొత్తగా 10 మంది
ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఇంకా 900
పరీక్షల రిపోర్ట్ పెండింగ్ లో ఉండడం గుబులు రేపుతోంది.
కరోనా పాజిటివ్ సోకిన ఖైదీలకు
కరోనా ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
కరోనా సోకిన సిబ్బందిలో కొందరు ఆసుపత్రుల్లో ఉండగా మరికొందరు హోమ్ ఐసోలేషన్
చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైల్ లో
కలవడాన్ని అధికారులు నిలిపివేశారు.