Advertisement

మంగళవారం ఏపీలో 1,395 మందికి కరోనా పాజిటివ్‌...

By: chandrasekar Wed, 18 Nov 2020 2:03 PM

మంగళవారం ఏపీలో 1,395 మందికి కరోనా పాజిటివ్‌...


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ మొదలైనప్పటి నుంచి సోమవారం అత్యంత తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం ఆ సంఖ్య డబుల్ అయింది. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచడంతో ఈ మేరకు కేసుల్లో పెరుగుదల నమోదైనట్లు సమాచారం.

మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 66,778 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,395 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,56,159కి చేరింది.

అయితే కరోనా మరణాలు కూడా మంగళవారం స్వల్పంగా తగ్గాయి. మంగళవారం కరోనా మహమ్మారి బారిన పడి 9 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, కడపలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,890కు చేరింది. అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా భారీగా పెరిగాయి.

మంగళవారం 2,293 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,32,284 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 16,985 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 92,64,085 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Tags :
|
|
|
|

Advertisement