Advertisement

  • కడప జైల్లో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

కడప జైల్లో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

By: chandrasekar Thu, 13 Aug 2020 5:59 PM

కడప జైల్లో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ


కడప జైల్లో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ చేయబడింది. ఖైదీలకు పెట్రోల్‌ బంకుల్లో పనిచేయడం ద్వారా వ్యాపించు ఉండవచ్చని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా వున్నా సమయంలో కడప సెంట్రల్‌ జైల్లో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎం వరప్రసాద్‌ వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఖైదీల యొక్క భద్రతా కారణాల దృష్ట్యా కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా బాధితులందరికీ పాలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు అందుబాటులో ఉండి కరోనా సోకిన ఖైదీలను పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. కడప సెంట్రల్‌ జైల్లో ఉన్న మొత్తం 700 మంది ఖైదీలకు కరోనా టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. దీనిద్వారా ఇంకా ఎవరికైనా కరోనా వ్యాపించిందా లేదా అన్న విషయం తెలుస్తుంది.

కొంతమంది ఖైదీలు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకుల్లో పని చేస్తున్నారు. కరోనా సోకిన బయటి వ్యక్తుల నుంచి వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు నిర్ధారించారు. కడప జిల్లాలో ఇప్పటి వరకు 14,640 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 8,955 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Tags :
|

Advertisement