Advertisement

  • ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా ..గత 24 గంటల్లో కేవలం 674 పాజిటివ్ కేసులే నమోదు

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా ..గత 24 గంటల్లో కేవలం 674 పాజిటివ్ కేసులే నమోదు

By: Sankar Tue, 04 Aug 2020 7:39 PM

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా ..గత 24 గంటల్లో కేవలం 674 పాజిటివ్ కేసులే నమోదు



ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులుగా రాజధానిలో వెయ్యి లోపు కేసులు మాత్రమే నమోదు అవుతుండడంతో పాలకులతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. గాలిలో వైరస్‌ క్షీణిస్తోందని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 674 కరోనా కేసులు నమోదు కాగా 972 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే నమోదవుతున్న కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారు ఎక్కువగా ఉంటుండడం సంతోషకర విషయం. కేవలం 12 మంది మాత్రమే ఇవాళ వైరస్‌ బారిన పడి మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 1,39,156కు చేరగా అందులో 1,25,226 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 4033 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే ఒక పదిహేను రోజుల ముందు వరకు కూడా దేశంలో అత్యధిక కేసులు నమోదు అయ్యే రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న ఢిల్లీ , ప్రభుత్వ కృషి , ప్రజల సహకారంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది ..ఏపీ వంటి రాష్ట్రాల్లో అనూహ్యంగా కరోనా కేసులు పెరిగినప్పటికీ ఢిల్లీలో తగ్గుముఖం పట్టడం మాత్రం శుభసూచికము అనే చెప్పవచ్చు ..

Tags :
|
|
|

Advertisement