దేశ రాజధానిలో మళ్ళీ కరోనా కలకలం ..తాజాగా మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు
By: Sankar Sun, 06 Sept 2020 9:50 PM
దేశ రాజధానిలో కరోనా కేసులు మళ్ళీ తీవ్ర స్థాయిలో నమోదు అయితున్నాయి..గత కొద్దీ కాలం నుంచి వెయ్యికి దగ్గర్లో నమోదు అయితున్న కరోనా కేసులు తాజాగా మూడు వేలకు పైగా నమోదు అవ్వడం ఆందోళన రేకెత్తిస్తుంది..జూన్ నెలలో రాష్ర్టంలో సుమారు 3వేల పైన కేసులు నమోదు కాగా ఆగస్టు మొదటి వారం వరకు కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటలేదు. అదే నెల చివరి వారం నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండగా తాజాగా సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ 3వేల మార్కు దాటింది.
ఇదే విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇటీవల మాట్లాడుతూ రాష్ర్టంలో టెస్టుల సంఖ్య పెంచడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని, వైరస్ సోకిన వారిని గుర్తించి నిర్బంధంలో ఉంచడంతోనే వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3,256 కరోనా కేసులు నమోదు అయ్యాయి ..
కాగా మొత్తం కేసుల సంఖ్య 1,91,449కు చేరుకుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 29 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు 4,567 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 20,909 యాక్టీవ్ కేసులుండగా.. 1,65,973 మంది ఇప్పటివరకు వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.