Advertisement

  • పుట్టిన బిడ్డను వదిలేసి హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన కరోనా రోగి

పుట్టిన బిడ్డను వదిలేసి హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన కరోనా రోగి

By: chandrasekar Mon, 17 Aug 2020 10:54 PM

పుట్టిన బిడ్డను వదిలేసి హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన కరోనా రోగి


దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ రావ్ హాస్పిటల్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బిహార్ లోని ఔరంగాబాద్ కు చెందిన ఓ మహిళ తనకు డెలివరీ డేట్ దగ్గర పడటంతో కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని హిందూ రావు హాస్పిటల్ లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. గర్భిణి అయిన ఆ మహిళకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. ఆగస్టు 11న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి వార్డు నుంచి వెళ్లిపోయింది.

కుటుంబసభ్యులు, హాస్పిటల్ వర్గాలు ఆమె కోసం గాలించగా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన శిశువుకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ గా తేలింది. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ శిశువు వారి సంరక్షణలోనే ఉంది. అయితే పారిపోయిన మహిళ గురించే అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆమె నుంచి మరి కొంత మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని అందరూ ఆందోళన చెందుతున్నారు.

Tags :
|
|
|

Advertisement