కరోనా లక్షణాలున్న నరేందర్ సింగ్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్ నుంచి మాయం
By: chandrasekar Tue, 16 June 2020 4:45 PM
కరోనా లక్షణాలున్న ఓ
వ్యక్తి గాంధీ హాస్పిటల్ నుంచి అదృశ్యమయ్యాడు. రెండు వారాలు గడిచిన అతడి ఆచూకీ
లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే నరేందర్ సింగ్ అనే వ్యక్తి
మే 30న
అనారోగ్యంతో కింగ్ కోఠీ హాస్పిటల్లో చేరాడు. నరేందర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పడుతుండటంతో రెండు గంటల తర్వాత గాంధీ హాస్పిటల్కు తరలించారని అతడి సోదరుడు ముకేశ్
సింగ్ తెలిపారు. మే 31న చివరిసారిగా నరేందర్తో ఫోన్లో మాట్లాడామని తర్వాత
అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ తర్వాతి నుంచి అతడి
ఆచూకీ కనిపించడం లేదన్నారు.15 రోజులు గడిచినా అతడి గురించి ఎలాంటి సమాచారం లభ్యం
కాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళ్హాట్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ
జరపగా నరేందర్ సింగ్ పేరు ఔట్ పేషెంట్ రిజిస్టర్లో కనిపించింది. కానీ అడ్మిషన్
రిజిస్టర్లో కనిపించలేదు. దీంతో అతడు ఎక్కడికి వెళ్లి ఉంటాడనే విషయమై పోలీసులు
విచారణ జరుపుతున్నారు.