ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషెంట్
By: Sankar Tue, 11 Aug 2020 11:09 AM
మలక్పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో 60 ఏండ్ల కోవిడ్ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రోగి స్వస్థలం కరీంనగర్ అని పోలీసులు తెలిపారు. ఆగస్టు 6వ తేదీన చికిత్స నిమిత్తం అతన్ని హాస్పిటల్లో చేర్పించారు.
కోవిడ్ పేషెంట్ తన రూమ్లో ఉరి వేసుకుని ఉన్నట్లు హాస్పిటల్ స్టాఫ్ గుర్తించింది. ఆ తర్వాత వాళ్లు పోలీసుల్ని అలర్ట్ చేశారు. అటాప్సీ నిర్వహించేందుకు మృతదేహాన్ని ఒస్మానియా జనరల్ హాస్పిటల్కు చాదర్ఘాట్ పోలీసులు తరలించారు. మానసిక ఆందోళనకు గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
కాగా తెలంగాణాలో తాజాగా 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 338 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 8 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 645కి చేరింది. ప్రస్తుతం 22,628 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 18,035 నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.