Advertisement

కరోనా వచ్చిందన్న భయంతో యువకుడు ఆత్మహత్య ..

By: Sankar Wed, 29 July 2020 5:46 PM

కరోనా వచ్చిందన్న భయంతో యువకుడు ఆత్మహత్య ..



కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది ..కరోనా వచ్చి మరణించేవారికన్నా ఆ కరోనా భయంతో మరణించేవారు ఎక్కువ అయ్యారు .. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పూర్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఛతార్‌పూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి జులై 26న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతనిలో కరోనా లక్షణాలు లేనప్పటికి పాజిటివ్ రావడంతో.. కొవిడ్ కేర్ సెంటర్‌లో చేర్పించారు. ఆరు నెలల క్రితం ఆ వ్యక్తి ఛాతి సంబంధిత సమస్య, గొంతు నొప్పికి చికిత్స తీసుకున్నాడు. దాని వల్ల కరోనా రాలేదని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో డాక్టర్లు అతనికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. మొత్తానికి కొవిడ్ బాధితుడు మంగళవారం అర్ధరాత్రి కొవిడ్ సెంటర్‌లోనే ఉరేసుకున్నాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరొవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 49,292 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించగా, ఏకంగా 781 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 15,32,449కి చేరింది

Tags :
|
|

Advertisement