Advertisement

  • క్వారంటైన్ లో ఉండాలని చెప్పినందుకు ఆశ వర్కర్ల పైన దాడి చేసిన కరోనా పేషెంట్

క్వారంటైన్ లో ఉండాలని చెప్పినందుకు ఆశ వర్కర్ల పైన దాడి చేసిన కరోనా పేషెంట్

By: Sankar Sat, 29 Aug 2020 4:37 PM

క్వారంటైన్ లో ఉండాలని చెప్పినందుకు ఆశ వర్కర్ల పైన దాడి చేసిన కరోనా పేషెంట్


కరోనా వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిపై పలు చోట్లు దాడులు చోటు చేసుకున్నాయి. తాజాగా కరోనా పేషెంట్... ఆశా వర్కర్లపై దాడికి దిగిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలం కిష్టాపూర్‌లో ఆశా కార్యకర్తలపై కోవిడ్ బాధితుడు దాడికి పాల్పడ్డాడు.

కోవిడ్ బారిన పడిన వ్యక్తిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆశావర్కర్లు శైలజ, లక్ష్మీ సూచించారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం కరోనా బాధితుడు ఆశావర్కర్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆశాకార్యకర్తలు శైలజ, లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కరోనా బాధితుడ్ని పోలీసులు బలవంతంగా క్వారంటైన్‌కు తరలించారు. కరోనా బారిన పడ్డవారు వైద్యం విషయంలో సిబ్బందికి సహకరించాలని పలువురు సూచిస్తున్నారు. దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :
|
|

Advertisement