బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కి మరోసారి కరోనా...
By: chandrasekar Tue, 17 Nov 2020 4:23 PM
బ్రిటిష్ ప్రధాని
మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కరోనా పాజిటివ్గా తేలిన
నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్కు నిర్వహించిన
పరీక్షల్లో ఆయనకూ వైరస్ సోకినట్లు తేలిందని బ్రిటన్ ప్రధాని అధికార నివాస
వర్గాలు సోమవారం పేర్కొన్నాయి.
అధికారుల సూచనలను
అనుసరించి ప్రధాని నవంబర్ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు
చూసుకుంటారని, కరోనా వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను
పర్యవేక్షిస్తారని తెలిపారు.
బోరిస్ జాన్సన్ కరోనా
బారిన పడినప్పటికీ లక్షణాలేవీ కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో
బ్రిటన్ ప్రధాని తొలిసారి కరోనా బారిన పడటమే కాకుండా.. పరిస్థితి తీవ్రం కావడంతో
ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే.
కరోనా నియంత్రణకు జాన్సన్
అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం
సిద్ధమైంది. యూకే మొత్తమ్మీద 6వేల
మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనుంది. దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల నుంచి
సుమారు 30 వేల
మందిని ఎంపిక చేస్తామంది.