తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఏర్పాట్లతో కరోనా మొబైల్ ఐసీయూ
By: chandrasekar Fri, 22 May 2020 3:25 PM
తెలంగాణ రాష్ట్రంలో కరోనా
కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
రాజేందర్ అన్నారు. గురువారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తయారు చేసిన కరోనా మొబైల్
ఐసీయూను ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ప్రముఖ ఐటీ సంస్థ మైక్రాన్ వంద
వెంటిలేటర్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, ప్రభుత్వం
మరో 400 వెంటిలేటర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
వెంటిలేటర్ల కోసం ఇప్పటికే ఆర్డర్ పెట్టామని చెప్పారు.
Tags :
corona |