Advertisement

  • కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పంజాబ్ మంత్రికే కరోనా...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పంజాబ్ మంత్రికే కరోనా...

By: chandrasekar Sat, 05 Dec 2020 4:59 PM

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పంజాబ్ మంత్రికే కరోనా...


దేశం మొత్తం త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హ‌ర్యానా ఆరోగ్య‌శాఖ‌ మంత్రి అనిల్ విజ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

అయితే.. ఆయన కొన్ని రోజుల క్రితం క‌రోనా వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకాను వేయించుకోవడం ఆందోళకు కారణమైంది. ఈ విషయాన్ని ఈ రోజు ఉద‌యం మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన కరోనా ప‌రీక్ష‌లో తనకు పాజిటివ్ గా తేలిన‌ట్లు ఆయ‌న తెలిపారు. న‌వంబ‌ర్ 20న మంత్రి అనిల్‌ కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అంబాలా హాస్పిట‌ల్‌లో జ‌రిగిన మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌లో మంత్రి వాలంటీగా మారారు. దీంతో ఆయన వాక్సిన్ వేయించుకున్నారు. వాక్సిన్ తీసుకున్న 15 రోజులకే ఆయనకు కరోనా సోకడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ సైతం భారత్ బయోటెక్ ను సందర్శించి వ్యాక్సిన్ తయారీలో పురోగతిపై సమీక్షించారు. అయితే ఈ విషయంపై భారత్ బయోటెక్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags :
|

Advertisement