Advertisement

తెలంగాణలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా

By: chandrasekar Tue, 08 Sept 2020 11:44 AM

తెలంగాణలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా


తెలంగాణలో కరోనా కేసులు నిన్న తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు కేసులు పెరిగాయి. తాాజగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,45,163కి చేరింది.

ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 906కి చేరింది

నిన్న తెలంగాణ వ్యాప్తంగా 60,923 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 18,27,905 నమూనాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది

మరో 24,579 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.69గా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.5శాతంగా ఉందని తెలిపింది.

Tags :
|
|
|

Advertisement