Advertisement

  • క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప కూతురుకు కూడా క‌రోనా పాజిటివ్

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప కూతురుకు కూడా క‌రోనా పాజిటివ్

By: chandrasekar Mon, 03 Aug 2020 3:50 PM

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూర‌ప్ప కూతురుకు కూడా క‌రోనా పాజిటివ్


ఆదివారం రాత్రి సీఎం యెడియూర‌ప్ప క‌రోనా పాజిటివ్ కారణంగా బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ హాస్పిటల్లో చేరారు. తాను బాగానే ఉన్నాన‌ని ట్వీట్ ద్వారా తెలియజేసారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి కూతురు కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. సీఎం కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆయ‌న కూతురుకు కూడా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆమె హాస్పిటల్లో చేరిన‌ట్లు మ‌ణిపాల్ హాస్పిట‌ల్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. జులై నెల మొద‌టివారంలో సీఎం అధికార నివాసంలోని ఆఫీస్‌లో ప‌నిచేస్తున్న వ్య‌క్తికి కూడా క‌రోనా సోకింది.

నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న గురుగ్రామ్‌లోని వేదాంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శ‌నివారం అమిత్‌షాను క‌లిసిన మంత్రి బాబూల్ సుప్రియో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అదేవిధంగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రీలాల్ పురోహిత్ కూడా క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఆదివారం ఆయ‌న చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో ప‌రీక్ష‌లు చేయింకున్నారు. అందులో ఆయ‌న‌కు పాజిటివ్ రావడంతో అయన త‌న నివాసంలోనే ఐసోలేష‌న్‌లో వుంటున్నారు.

Tags :
|

Advertisement