ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్,లో కరోనా
By: chandrasekar Mon, 07 Sept 2020 5:31 PM
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 13
మంది కరోనా వైరస్ బారినపడగా తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ కరోనా కేసు వెలుగులోకి రావడం గమనార్హం. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా ఆగస్టు 20న అక్కడికి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ చేరుకుంది. అయితే అప్పుడు టీమ్తో కలిసి వెళ్లని ఆ జట్టు అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఆలస్యంగా ఇటీవల యూఏఈకి వెళ్లాడు. ఈ క్రమంలో క్వారంటైన్లో ఉన్న అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.
యూఏఈకి వచ్చిన వెంటనే నిర్వహించిన రెండు కరోనా టెస్టుల్లో అతనికి నెగటివ్ వచ్చింది. మూడో టెస్టులో పాజిటివ్గా రావడంతో ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అక్కడికి రాగానే క్వారంటైన్లో ఉన్న అతనితో క్రికెటర్లు, టీమ్ స్టాఫ్ మెంబర్స్ ఎవరూ కలవలేదని స్పష్టం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..
14 రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించి నెగటివ్ అని తేలితేనే జట్టులోకి అతడ్ని అనుమతిస్తామని పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఆ టీమ్ స్టాఫ్ 11
మంది కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ మెడికల్ స్టాఫ్ మెంబర్కి కూడా కరోనా సోకింది. ఐపీఎల్ 2020 షెడ్యూల్ ని ఆదివారం బీసీసీఐ విడుదల చేసింది.