Advertisement

  • తగ్గుముఖం పట్టిన కరోనా.. తెలంగాణలో శుక్రవారం కొత్తగా 596 కేసులు..

తగ్గుముఖం పట్టిన కరోనా.. తెలంగాణలో శుక్రవారం కొత్తగా 596 కేసులు..

By: chandrasekar Sat, 05 Dec 2020 9:20 PM

తగ్గుముఖం పట్టిన కరోనా.. తెలంగాణలో శుక్రవారం కొత్తగా 596 కేసులు..


ప్రస్తుతం కరోనా కేసులు భారీగానే తగ్గుతున్నాయి. ఇందుముందుకంటే ఇప్పుడు ఇమ్మ్యూనిటి పవర్ ప్రజల్లో అధికమవ్వడం వల్ల పాజిటివ్ కేసులు తగ్గాయి. తెలంగాణలో శుక్రవారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. శుక్రవారం మొత్తం 596 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,72,719 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8498గా ఉన్నాయి. వీరిలో 6,465 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 921 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక శుక్రవారం మరో ముగ్గురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1470కి చేరింది. శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 102 కొత్త కేసులు నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీ తరువాత కరోనా కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 46, 47 చొప్పున కొత్త కేసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాక, అన్ని జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు, తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 59,471 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 803 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 57 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 803 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. గతంలో వున్న కేసులతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ గా నమోదవుతున్నాయి.

Tags :
|

Advertisement