Advertisement

  • తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా తగ్గు ముఖం పట్టిన కరోనా

By: chandrasekar Mon, 24 Aug 2020 1:06 PM

తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా తగ్గు ముఖం పట్టిన కరోనా


తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు వివరాలు తెలుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా రెండువేలు దాటి నమోదవుతున్న కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,842 కరోనా పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ఎప్పటిలాగే అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 373 నమోదయ్యాయి.

రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 1,06,091 కరోనా పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో ఇవాళ ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 761కు చేరింది. ఇవాళ 1,825 మంది వైరస్‌బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 82,411 మంది. మరో 22,919 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. హోంక్వారంటైన్‌తో పాటు ఐసోలేషన్‌ కేంద్రాల్లో 16,482 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 36,282 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 9,68,121 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 373, రంగారెడ్డి జిల్లాలో 109, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 31 లక్షల 06 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 61,408 కేసులు నమోదు అయ్యాయి. 836 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 57,469 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఎక్కువగా జాగ్రత్త వహించినట్లైతే వైరస్ వ్యాపించకుండా చూడవచ్చని అధికారులు చెబుతున్నారు.

Tags :
|

Advertisement