ఆంధ్రలో విస్తృతంగా పెరుగుతున్న కరోనా
By: chandrasekar Wed, 07 Oct 2020 10:09 AM
ఆంధ్రప్రదేశ్లో గత
కొన్నిరోజులుగా తగ్గుతున్న కేసులు మళ్లీ పెరుగుతండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా గత 24గంటల్లో 65,889 శాంపిళ్లను పరీక్షించగా.. 5,795 కరోనా
కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24
గంటల్లో 33 మంది
ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల
సంఖ్య 7,29,307 కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 6,052 కి
పెరిగింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్
వైద్యఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం హెల్త్
బులెటిన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 50,776 కరోనా కేసులు యాక్టివ్గా ఉండగా
ఇప్పటివరకు 6,72,479 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు
రాష్ట్రవ్యాప్తంగా 62,16,240 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అంతేకాకుండా గడచిన 24
గంటల్లో 6,046 మంది
కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.