Advertisement

కరోనా: భారతీయులకు శుభవార్త

By: Anji Thu, 27 Aug 2020 08:51 AM

కరోనా: భారతీయులకు శుభవార్త

కరోనాను పుట్టించిన చైనాలో ఇప్పుడు ఆ వైరస్ ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ప్రజల్లో వచ్చేసిందట.. ఏకంగా 80శాతం వరకు రికవరీ రేటు ఉంటోంది. ఇప్పుడు అక్కడ మాస్కులు కూడా దరించ కుండా జనాలు తిరుగుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఫొటోలు వీడియోలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం భారతదేశంలో కూడా గుడ్ న్యూస్ వచ్చింది.మన దేశంలో రోజురోజుకి కరోనా రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 77శాతానికి చేరుకుంది. . కరోనా కేసులను కట్టడి చేయడానికి గాను భారత్ ఇప్పుడు పరీక్షల సంఖ్యతో పాటు రికవరీ రేటుని కూడా చాలా వేగంగా పెంచే ప్రయత్నం చేస్తోంది.


భారత్ లో 24 గంటల్లో 67వేల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు సగానికి పైగా రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణలో రికవరీ రేటు చైనాతో సమానంగా 80శాతం ఉండడం విశేషంగా మారింది.

Tags :

Advertisement