సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా
By: chandrasekar Fri, 03 July 2020 1:35 PM
కరోనా మహమ్మారి
ప్రపంచాన్నే కాదు భారత దేశాన్ని సైతం అతలాకుతలం చేసేస్తోంది. కరోనా కాటుకు యావత్
భారత దేశం బలైపోతోంది. చిన్న-పెద్ద, బీధ-ధనిక అనే తేడా లేకుండా ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి
కారోనా పాజిటివ్ అని తెలుస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే పలువురు
నటీనటులు, రాజకీయ
నాయకులు కరోనా బారిన పడుతుండటం జనాల్లో కంగారు పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో
కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇద్దరు టీవీ నటులకు కరోనా
పాజిటివ్ రావడం బుల్లితెర వర్గాలను ఓ కుదుపు కుదిపేసింది.
ఆ తర్వాత యాంకర్ ఓంకార్
కూడా కరోనా బారిన పడ్డారని విన్నాం కానీ అది నిజం కాదని తెలిసింది. ఇక మరో సీరియల్
నటి నవ్య స్వామికి కూడా కరోనా సోకిందంటూ గత రెండు రోజులుగా వార్తలు షికారు
చేస్తున్నప్పటికీ క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై
స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో ద్వారా తనకు కరోనా సోకిన మాట వాస్తవమే అని చెప్పేసింది
నటి నవ్య స్వామి. గత మూడు, నాలుగు రోజులుగా తలనొప్పి, అలసట
ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ఆమె తెలిపింది. అయితే ఈ
విషయాన్ని చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన, భయపడాల్సిన పని లేదని ఆమె పేర్కొంది.
ప్రస్తుతం పౌష్టికాహారం
తీసుకుంటూ సెల్ఫ్ ఇసోలేషన్లో విడిగా ఉంటున్నానని, అంతకుముందు తనతో
కాంటాక్ట్ అయిన వారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే కరోనా టెస్ట్
చేయించుకోండని నవ్య స్వామి చెప్పింది.