Advertisement

కియార అద్వానీ సినిమా షూటింగ్‌లో కరోనా కలకలం..

By: chandrasekar Fri, 04 Dec 2020 9:16 PM

కియార అద్వానీ సినిమా షూటింగ్‌లో కరోనా కలకలం..


తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎస్పీ బాలు వంటి వాళ్లు కరోనా కారణంగా కన్నుమూసారు. మరోవైపు సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. రీసెంట్‌గా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఆ సంగతి మరవక ముందే కియార అద్వానీ హిందీలో నటిస్తోన్న ‘జుగ్ జుగ్ జియో’ సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ ధావన్‌తో పాటు మరో అగ్ర నటుడు అనిల్ కపూర్‌తో పాటు నటి నీతూ సింగ్ కపూర్‌‌తో పాటు దర్శకుడు రాజ్ మెహతాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా టీమ్ మెంబర్స్‌లో కీలక సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసారు. ఇప్పటికే కియార అద్వానీ విషయానికొస్తే.. ఈమె తెలుగుతో పాటు హిందీలో పలు చిత్రాల్లో బిజీగా ఉంది.

రీసెంట్‌గా అక్షయ్ కుమార్‌తో కలిసి ‘లక్ష్మి’ సినిమాలో నటించింది. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. మరోవైపు కియార తెలుగులో మంచి కథ దొరికితే యాక్ట్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది.

Tags :
|

Advertisement