Advertisement

రాజ్‌భవన్‌లో 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా

By: chandrasekar Mon, 13 July 2020 11:25 AM

రాజ్‌భవన్‌లో 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా


కరోనా వైరస్‌ వ్యాప్తి తెలంగాణలోని రాజ్‌భవన్‌కు సైతం చేరింది. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కరోనా పరీక్షల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌, ఇతర సీనియర్‌ అధికారులకు నెగిటివ్‌ అని తేలింది. రెడ్‌జోన్లలో కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు.

ఈ మేరకు తెలంగాణ రాజ్‌భవన్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజ్ భవన్‌లో మొత్తం 28 మంది భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 10 మందికి పాజిటివ్ అని తేలింది.

పాజిటివ్‌గా తేలిన వీరి కుటుంబ సభ్యుల్లోనూ మరో 10 మందికి కరోనా సంక్రమించినట్లు సమాచారం.

Tags :
|
|

Advertisement