Advertisement

  • నేపాల్‌ మంత్రివర్గంలో కరోనా సోకిన తొలి మంత్రి...

నేపాల్‌ మంత్రివర్గంలో కరోనా సోకిన తొలి మంత్రి...

By: chandrasekar Mon, 12 Oct 2020 3:27 PM

నేపాల్‌ మంత్రివర్గంలో కరోనా సోకిన తొలి మంత్రి...


నేపాల్‌ పర్యాటకశాఖ మంత్రి యోగేశ్‌ భట్టారాయ్‌ కరోనాబారిన పడ్డారన్న విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

శనివారం చేసిన వైరస్‌ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్టు వెల్లడించారు. నేపాల్‌ మంత్రివర్గంలో కరోనా సోకిన తొలి మంత్రి ఈయనే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ వైరస్‌లేని దేశంగా నేపాల్‌ నిలిచిందని ఫిబ్రవరిలో చేసిన ఓ ప్రకటనలో యోగేశ్‌ అభిప్రాయపడ్డారు.

దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, వైరస్‌ నిర్ధారణ కావడానికి ముందు యోగేశ్‌ నేపాల్‌లోని భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో గురువారం భేటీ అయ్యారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా వినయ్‌ మోహన్‌ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Tags :
|
|
|

Advertisement