నేపాల్ మంత్రివర్గంలో కరోనా సోకిన తొలి మంత్రి...
By: chandrasekar Mon, 12 Oct 2020 3:27 PM
నేపాల్ పర్యాటకశాఖ
మంత్రి యోగేశ్ భట్టారాయ్ కరోనాబారిన పడ్డారన్న విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
శనివారం చేసిన వైరస్
పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్టు వెల్లడించారు. నేపాల్ మంత్రివర్గంలో కరోనా సోకిన
తొలి మంత్రి ఈయనే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా
విజృంభిస్తున్న వేళ వైరస్లేని దేశంగా నేపాల్ నిలిచిందని ఫిబ్రవరిలో చేసిన ఓ ప్రకటనలో
యోగేశ్ అభిప్రాయపడ్డారు.
దేశీయ పర్యాటక రంగాన్ని
ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, వైరస్
నిర్ధారణ కావడానికి ముందు యోగేశ్ నేపాల్లోని భారత రాయబారి వినయ్ మోహన్
క్వాత్రాతో గురువారం భేటీ అయ్యారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా వినయ్ మోహన్ హోం
ఐసోలేషన్లోకి వెళ్లారు.
Tags :
corona |
first |
minister |
nepals |