డెంగ్యూ వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువట...
By: chandrasekar Mon, 12 Oct 2020 8:42 PM
డెంగ్యూ వైరస్ ఎక్కువగా
ఉన్న ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నట్లు చెపుతున్నారు. డెంగ్యూ ఒక
అంటువ్యాధి. ఇది దోమ కాటు వల్ల వస్తుంది. ఏడెస్ ఈజిప్టి అనే ఆడ దోమ సాధారణంగా ఈ
దోమ పగటిపూట కుడుతుంది. డెంగ్యూ వైరస్ ఆర్ఎన్ఏ ఫ్లేవివిరిడ్ కుటుంబానికి చెందినది.
డెంగ్యూ వ్యాప్తి చెందిన ఈడెస్ ఈజిప్టి దోమ సంక్లిష్ట వైరస్ను రక్తంలోకి విడుదల
చేస్తుంది. ఇప్పటివరకు డెంగ్యూ సెరోటైప్-1 వైరస్లు కనుగొన్నారు. అయితే, సెరోటైప్-2, 3 కూడా
ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రజలు దోమ కాటును చాలా తేలికగా తీసుకుంటారు. డెంగ్యూ
లక్షణాలను అర్థం చేసుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం. డెంగ్యూ
వ్యాధి సోకడంతో ముఖ్యంగా అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం, తలనొప్పిగా
ఉండటం, కళ్ళలో
నొప్పి, కండరాలు, కీళ్ళలో
తీవ్రమైన నొప్పి, శరీర దద్దుర్లు, చలి ఎక్కువగా ఉండటం, ఆకలి లేకపోవడం, గొంతు
నొప్పి, చెవులు, చిగుళ్ళు, మూత్రం నుంచి అసాధారణంగా రక్తం కారడం వంటివి ఉన్నాయి.
ఈ లక్షణాలు సాధారణంగా 3 నుంచి 14 రోజులలో అభివృద్ధి చెందుతాయి.
వర్షా కాలం మరియు
శీతాకాలంలో ఎక్కువగా దోమల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. డెంగ్యూ వ్యాధి రాగానే
శరీరంలోని రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతాయి. జాగ్రత్తలు
తీసుకోనిపక్షంలో ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.డెంగ్యూ ఇంటి
నివారణలుపై లక్షణాలలో ఏదైనా సాధారణం కంటే ఎక్కువసేపు కొనసాగితే వెంటనే వైద్యుడిని
సంప్రదించాలి. ఎవరికైనా డెంగ్యూ జ్వరం ఉంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా త్రాగాలి.
అదేవిధంగా తులసి ఆకులను ఉడకబెట్టి దాని నీరు తాగడం వల్ల కూడా డెంగ్యూను నయం
చేయవచ్చు. మెంతి ఆకులను ఉడకబెట్టి దాని నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని విషాలను
బయటకు పంపిస్తుంది. బొప్పాయి ఆకులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని వైద్యులు
చెప్తున్నారు. అందులో ఉన్న పాపైన్ శరీరం యొక్క జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది.
దాని రసం తాగడం ద్వారా ప్లేట్లెట్స్ వేగంగా పెరుగుతాయి. అందువల్ల బొప్పాయి ఆకుల
రసం తరచుగా ఈ వ్యాధికి వాడుతారు.
డెంగ్యూ వైరస్ ను
నిరోధించడానికి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, అపరిశుభ్ర
వాతావరణం ఉండకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ
ఉండకుండా చూసుకోవాలి.డెంగ్యూతో కరోనా కనెక్షన్డెంగ్యూ, కరోనా
మహమ్మారి మధ్య కనెక్షన్ గురించి చాలా నివేదికలు వచ్చాయి. డెంగ్యూ వైరస్ ఎక్కువగా
ఉన్న ప్రాంతాల్లో తక్కువ మంది ప్రజలు కరోనాతో బాధపడుతున్నారని పలు పరిశోధనలు
తేల్చాయి. డెంగ్యూ వైరస్కు వ్యతిరేకంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలు
కరోనా వైరస్ శరీర కణాలలో పెరగకుండా నిరోధిస్తుంది. డెంగ్యూ, చికున్గున్యా
వంటి వైరల్ వ్యాధుల వల్ల ఆర్థరైటిస్ కేసులు పెరుగుతున్నాయని ఆలిండియా ఇన్స్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తమ 2014 నివేదికలో చెప్పారు. రానున్న కాలంలో దోమల నుండి తగు
జాగ్రత్తలు తీసికోవాలని సూచిస్తున్నారు.