Advertisement

తమిళనాడులో 7,322కు చేరిన కరోనా మరణాల సంఖ్య

By: chandrasekar Tue, 01 Sept 2020 09:56 AM

తమిళనాడులో 7,322కు చేరిన కరోనా మరణాల సంఖ్య


మొదట చెన్నై లో అధికంగా నమోదైన కరోనా కేసులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికమవుతున్నాయి. తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు, మరణాల సంఖ్య ఏడు వేలు దాటాయి. గత నెల రోజులుగా తమిళనాడులో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి.

వారాంతమైన ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,956 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 91 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,041కు, మరణాల సంఖ్య 7,322కు చేరింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,68,141 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 59,900 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంట్లలో 6,008 కరోనా రోగలు కోలుకున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో తమిళనాడులో మరింత సడలింపులు చేశారు. దీని వల్ల కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం వుంది.

Tags :
|
|

Advertisement