Advertisement

  • నిజామబాద్ జిల్లాలో కలకలం: కరోనా మృతదేహం తారుమారు..!

నిజామబాద్ జిల్లాలో కలకలం: కరోనా మృతదేహం తారుమారు..!

By: Anji Sat, 26 Sept 2020 4:58 PM

నిజామబాద్ జిల్లాలో కలకలం: కరోనా మృతదేహం తారుమారు..!

హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనాతో మృతి చెందిన బాధితుని మృతదేహం తారుమారు అయింది. ఈ ఘటన తో నిజామబాద్ జిల్లాలో కలకలం రేగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి బదులు మరో మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆసుపత్రి నిర్వాకంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

దీంతో బంధువులు అయోమయోంలో పడిపోయారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతుకు కరోనా సోకింది. దీంతో అతడ్ని మెరుగైన వైద్యం కోసంహైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మరణించారు. అయితే అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి ఆస్పత్రి సిబ్బంది తీసుకొచ్చారు.

అంతిమ సంస్కారానికి కొన్ని క్షణాల ముందు మృతదేహాలు తారుమారు అయినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించడంతో.. వెంటనే అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్ డ్రైవర్కు సమాచారం అందించారు. దీంతో అంత్యక్రియలు నిలిచిపోవడంతో అయోమయానికి గురైన బంధువులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతు మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువుల పట్టుపడుతున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

Tags :

Advertisement