Advertisement

  • నగరంలో కరోనా నియంత్రణ స్థాయిని దాటిపోతుందా ...?

నగరంలో కరోనా నియంత్రణ స్థాయిని దాటిపోతుందా ...?

By: Sankar Thu, 11 June 2020 7:03 PM

నగరంలో కరోనా నియంత్రణ స్థాయిని దాటిపోతుందా ...?


లాక్‌డౌన్‌ ఎత్తివేత.. నగరవాసుల్లో సంతోషం కంటే విషాదాన్నే ఎక్కువ పంచనుందా.. పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. నగరంలో ఒక్కటొక్కటిగా ఓపెన్‌ అవుతున్న సంస్థలు, సముదాయాలు జనాన్ని అనివార్యంగా రహదారులపైకి తీసుకువస్తున్నంత వేగంగా.. కోవిడ్‌ వైరస్‌ విస్తరణ వేగాన్ని నియంత్రించే దిశగా వ్యక్తులు, యంత్రాంగాలు చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు ముందుకు వస్తున్నాయి.

గడిచిన పది రోజులుగా గ్రేటర్‌హైదరాబాద్‌తో పాటు శివారు కార్పొరేషన్లయిన బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటలలో నమోదవుతున్న కొత్త కేసులుహడలెత్తిస్తున్నాయి. కోవిడ్‌ బారిన పడ్డవారికి సరైన చికిత్సఅందడం, వారి చుట్టూ ఉన్న ప్రైమరి, సెకండరీ వ్యక్తులకు పరీక్షలు చేసే అంశం ప్రహసనంగా మారిందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే.. ఆస్పత్రిలో చేరడం, తమ చుట్టూ ఉన్న వారికి పరీక్షలు చేయించే అంశమే నగరంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిపోయిందన్న ఆందోళనఅందరిలో వ్యక్తమవుతోంది.

corona,hyderabad,hotspot,lockdown,boduppal,pirjadhiguda , గ్రేటర్‌హైదరాబాద్‌,  బోడుప్పల్, పీర్జాదిగూడ, కోవిడ్‌ వైరస్‌ , లాక్‌డౌన్‌



నగరంలో ఇప్పటికే పలు మార్కెట్లు, ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా కోవిడ్‌ వైరస్‌ విస్తరణకు హాట్‌స్పాట్లుగా మారిపోయాయి. వ్యాధిగ్రస్తుల్లో భరోసా నింపి వారిని క్షేమంగా ఇళ్లకు పంపాల్సిన ఆస్పత్రుల సిబ్బందే భారీ ఎత్తున వైరస్‌ భారిన పడుతుండటం ఆందోళనకర అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో కలుపుకుని అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అందులో అత్యధికం మార్కెట్లు, ఆస్పత్రుల నుంచి సోకినవే ఉన్నాయి. అయితే తాజాగా షాపింగ్‌ మాల్స్, ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలకు అనుమతించిన దృష్ట్యా, వ్యాధి నియంత్రణలో పకడ్బంధీ చర్యల్లో ఏ మాత్రం రాజీ పడ్డా అవి మరో కొత్త హాట్‌స్పాట్లు అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

నగరంలో వ్యాధి విస్తరణ ఆగాలంటే.. ‘టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌’లు తప్పని సరి చేయాలి. వ్యాధి సోకిన వ్యక్తి తనంతట తానుగా ఆస్పత్రికి వచ్చి చేరితే ఆయన చుట్టూ ఉన్న వారికి పరీక్షలు చేయకుండా వదిలేయడం, నగరంలో చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే.. పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇలాంటి వారితో మరీ ప్రమాదం. వీరు అంతటా తిరిగి బలహీనంగా ఉన్న వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పట్లో కోవిడ్‌ దారికి వచ్చేలా కనిపించడం లేదు.


Tags :
|

Advertisement