ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో కరోనా కలకలం ..
By: Sankar Wed, 26 Aug 2020 12:02 PM
కరోనా తీవ్రత తెలంగాణలో తీవ్ర స్థాయిలో ఉంది ..తొలుత హైద్రాబాదు పరిధిలో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినప్పటికీ మెల్ల మెల్లగా జిల్లాలు అన్నటికి కరోనా వైరస్ పాకింది..ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అయితున్నాయి..
జిల్లా పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే సీఐలు, ఎస్ఐలు సహా కానిస్టేబుళ్లు, హోంగార్డుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది హోంక్వారంటైన్లో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పోలీస్ సిబ్బంది విధులకు రావడానికి సైతం జంకుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 200మందికిపైగా పోలీస్ సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. ఖమ్మం నగరంలో తీవ్రత ఎక్కువగా ఉంది. నిరంతరం బందోబస్తులు, 24గంటల విధుల నిర్వహణ వల్లే పోలీసులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. చాలా పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కరోనా బారిన పడి..చికిత్స పొందుతున్నారు. దీంతో ఫిర్యాదుదారులు కూడా రావాలంటే జంకుతున్నారు