Advertisement

  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

By: Sankar Thu, 16 July 2020 9:49 PM

ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా



తెలంగాణ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది ..అయితే గత వారం రోజుల వరకు కేవలం హైదరాబాద్ , రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే ఎక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి ..కానీ గత వారం నుంచి రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా తయారు అయింది ...ఆ మూడు జిల్లాలు మాత్రమే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలకు కూడా కరోనా పాకింది ..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్క రోజే 69 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 627కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 461గా ఉంది. మరోవైపు మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గురువారం నాటితో మృతుల సంఖ్య 19కి చేరింది. ఇదిలా ఉంటే.. నల్గొండ జిల్లాలో తాజాగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి..

దీనితో జిల్లాలో పాజిటివ్ కేసులు 309కి చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 268గా ఉండగా మరణాల సంఖ్య 12 నమోదయ్యాయి. కాగా.. సూర్యాపేట జిల్లాలో తాజాగా 15 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 226కి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 134, మృతుల సంఖ్య 5గా ఉంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో తాజాగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 92కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 59, మృతుల సంఖ్య 02గా ఉంది.

Tags :
|
|

Advertisement