తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
By: chandrasekar Fri, 28 Aug 2020 3:11 PM
తెలంగాణలో కరోనా బీభత్సం రోజురోజుకూ పెరిగిపోతోంది. గురువారం రాత్రి 8 వరకు 24 గంటల్లో కొత్తగా 2,932 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11
మంది కరోనాతో మరణించారు.
ఇప్పటివరకూ తెలంగాణలో తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,17,415 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ
799 కరోనా మరణాలు సంభవించాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో ప్రస్తుతం 28,941 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో
520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే.. మేడ్చల్ మల్కాజ్గిరిలో
218, కరీంనగర్ 168, నల్గొండ
159, ఖమ్మంలో 141, నిజామాబాద్
129, జగిత్యాల 113 కరోనా కేసులు నమోదయ్యాయి.