తెలంగాణ కరోనా కేసులు తగ్గుముఖం...
By: chandrasekar Tue, 27 Oct 2020 5:18 PM
తెలంగాణలో కరోనా కేసులు
నిన్నటికన్నా ఇవాళ కాస్త ఎక్కువ కేసులు నమోదు అయినప్పటికీ... రాష్ట్రంలో గత కొద్ది
రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రెండురోజులుగా వెయ్యిలోపే పాజిటివ్
కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 837 కరోనా
కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్
చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,671కి చేరింది. తాజాగా 1,554 మంది మహమ్మారి నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 2,13,466 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్లో తెలిపింది.
తాజాగా కరోనా కారణంగా
నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,315కి చేరింది. రాష్ట్రంలో
ప్రస్తుతం 17,890 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 14,851 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.56
శాతానికి తగ్గిపోయిందని రికవరీ రేటు భారత్
వ్యాప్తంగా 90.3 శాతంగా ఉంటే తెలంగాణలో 91.14
శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో
17,890 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 14,851 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా
తాజాగా 21099 కరోనా
టెస్ట్లు నిర్వహించగా మొత్తం టెస్ట్ల సంఖ్య 41,15,516 కు పెరిగింది. అయితే సోమవారం కరోనా టెస్ట్ల సంఖ్య
భారీగా తగ్గి పోయింది. అందుకే కరోనా కేసులు కూడా భారీగా తగ్గాయి.