Advertisement

దేశ రాజధాని లో భారీగా తగ్గిన కరోనా కేసులు..

By: chandrasekar Mon, 17 Aug 2020 11:26 PM

దేశ రాజధాని లో భారీగా తగ్గిన కరోనా కేసులు..


దేశ రాజధాని న్యూ ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల క్రితం రోజుకు సుమారు 4వేల కేసులు నమోదు కాగా ప్రస్తుతం వెయ్యి దాటడం లేదు. ఇదే కాకుండా వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతుండడంతో న్యూ ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీంతో కరోనా నుంచి దేశ రాజధాని కోలుకుంటోందని అధికారులు అంటున్నారు.ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 787 కరోనా కేసులు నమోదు కాగా.. 740 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఇవాళ 18 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు 1,53,367 కరోనా కేసులు నమోదు కాగా అందులో 1,38,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కేవలం 10,852 మంది మాత్రమే కరోనాతో దవాఖానల్లో చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు మొత్తం 4,214 మంది వ్యాధి సోకి మృత్యువాత పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలియజేశారు.

Tags :

Advertisement