తూర్పు గోదావరి జిల్లాలో లక్ష దాటిన కరోనా కేసులు
By: chandrasekar Mon, 05 Oct 2020 09:25 AM
కరోనా వైరస్ సంఖ్యలు
తూర్పు గోదావరి జిల్లాలో లక్ష దాటేశాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు
నిలకడగా ఉన్నాయి. శనివారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అయితే ఒక్క తూర్పు
గోదావరి జిల్లాలోనే కరోనా కేసులు లక్ష దాటేశాయి. కరోనా మరణాలు కూడా కాస్త
తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెద్ద
ఎత్తున చేస్తున్నారు. తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు సంఖ్య 6
మిలియన్లు (60 లక్షలు) దాటింది. ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య
శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 72,811 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,242
మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా
వైరస్ కేసులు 7,19,256కు చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్
మరణాలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఆదివారం కరోనా బారినపడి 40 మంది
మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,981కు
చేరుకుంది.
కొత్తగా కరోనా కేసులు
నమోదవుతున్న మరణాలు సంఖ్య మాత్రం తగ్గింది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24
గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు
గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో
ముగ్గురు, విశాఖపట్నంలో
ముగ్గురు, శ్రీకాకుళంలో
ఇద్దరు, పశ్చిమ
గోదావరిలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు మృత్యువాత పడ్డారు. అలాగే గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు ఏపీలో
మళ్లీ పడిపోయాయి. ఆదివారం 7,084 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి
అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,19,258 పాజిటివ్ కేసులకు గాను,
6,58,875 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం
54,400 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు జిల్లాలో కరోనా
కేసులు యథావిధిగా పెరిగిపోతున్నాయి. ఈ ఒక్క జిల్లాలో 1,00,785 మందికి కరోనా సోకింది. అలాగే చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం మళ్లీ కరోనా కేసులు
ఒక్కసారిగా పెరిగాయి. అందరూ మాస్కులు ధరించి జాగ్రత్త వహించాలని అధికారులు
కోరుతున్నారు.