ఏపీలో మళ్లీ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 77 మరణాలు
By: chandrasekar Thu, 06 Aug 2020 11:48 AM
గత రెండు, మూడు రోజులుగా ఏపీలో కరోనా వైరస్ మళ్లీ పంజా
విసురుతోంది. కేసుల సంఖ్య కాస్త తగ్గినా మళ్లీ పెరిగాయి. టెస్టుల సంఖ్య పెంచే కొద్దీ
కేసులు కూడా నమోదవుతున్నాయి. బుధవారం
మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 60,576 శాంపిల్స్ పరీక్షించగా మరో 10128
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా
మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 186461కు చేరింది. గడచిన 24 గంటల్లో 77మంది
చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1681కి
చేరింది. గత 24
గంటల్లో 8,729మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 104354నమోదయ్యింది. మరో 80426మంది
హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1544,
కర్నూలు జిల్లాలో 1368, అనంతపురం జిల్లాలో 1260, విశాఖపట్నం జిల్లాలో 842, గుంటూరు జిల్లాలో 730, కడప జిల్లాలో 729, చిత్తూరు
జిల్లాలో 677, విజయనగరం
జిల్లాలో 665, పశ్చిమగోదావరి
జిల్లాలో 582, నెల్లూరు
జిల్లాలో 537, కృష్ణా
జిల్లాలో 440
శ్రీకాకుళం జిల్లాలో 405, ప్రకాశం
జిల్లాలో 349
కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 26,229 పాజిటివ్ కేసులు. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 22063కు చేరాయి. అనంతపురం జిల్లాలో 20061 పాజిటివ్ కేసులు నమోదైనాయి.