తమిళనాడులో ఆరు లక్షలకు చేరువలో కరోనా కేసులు
By: chandrasekar Wed, 30 Sept 2020 7:03 PM
తమిళనాడులో రోజుకు
ఐదువేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య ఆరు
లక్షలకు చేరువలో ఉంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5546 కరోనా
కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో
తెలిపింది. కొత్తగా 5501 మంది బాధితులు డిశ్చార్జి అయినట్లు పేర్కొంది.
ఇప్పటి వరకు
రాష్ట్రవ్యాప్తంగా 5,91,943 కేసులు నమోదయ్యాయని, ఇందులో 5,36,209 మంది కోలుకున్నారని, 46,281 ఆక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో
కొత్తగా కరోనా ప్రభావంతో 70 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9453కి
చేరిందని తెలిపింది. ఒకే రోజు 85,997 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా ఇప్పటి వరకు 70,50,820 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. 66 ప్రభుత్వ,
120 ప్రైవేటు ల్యాబ్లలో శాంపిల్స్ పరీక్షించినట్లు
తెలిపింది.