Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కరోనా దెబ్బ

By: chandrasekar Sat, 29 Aug 2020 09:35 AM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కరోనా దెబ్బ


చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కరోనా దెబ్బ తగిలింది. ఐపీఎల్ మ్యాచులు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ధోనీ సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కరోనా దెబ్బ తగిలిందని సమాచారం. ధోనీ జట్టులోని ఓ భారత పేసర్ సహా పది మంది సపోర్ట్ స్టాఫ్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించాలని సీఎస్‌కే భావించింది. కానీ జట్టు సభ్యులకు కరోనా సోకడంతో మరో వారం పాటు క్వారంటైన్‌ను పొడిగించుకుంది.

యూఏఈ లో వున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కరోనా బారిన పడిన వారిలో భారత పేసర్ దీపక్ చాహర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. జట్టు సభ్యులు దుబాయ్ చేరుకున్న తర్వాత కరోనా సోకినట్లు తేలిందని సమాచారం. ఆగస్టు 21న దుబాయ్‌ చేరుకున్న సీఎస్‌కే టీమ్ ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆరు రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీల్ టోర్నీ ప్రారంభం కానుంది. అంతలోగా ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త వచించాలి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. యూరప్‌లో మొదలైన ఫుట్ బాల్ మ్యాచ్ ప్లేయర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. మొత్తం 8 జట్లు, వెయ్యి మందికిపైగా సభ్యులున్న ఐపీఎల్‌పైనా కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఏ జట్టుకు చెందిన వారైనా కోవిడ్ బారిన పడొచ్చు. అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నా చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు కరోనా బారిన పడటం దురదృష్టకరం అని క్రికెటర్లకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించిన వర్గాలు వ్యాఖ్యానించాయి. యూఏఈ చేరుకున్న తర్వాత సీఎస్‌కే సభ్యులకు నాలుగు సార్లు టెస్టులు చేశారు. శుక్రవారం చివరిసారిగా టెస్టు చేశారని తెలుస్తోంది.

ప్రస్తుత వివరాల ప్రకారం చెన్నై టీంలోని 12 మంది సపోర్ట్ స్టాఫ్ తో బాటు ఒక పేసర్ కరోనా బారిన పడ్డారని తెలిసింది. కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడటంతోపాటు వేదికను యూఏఈకి మార్చారు. స్టాఫ్, క్రికెటర్లు బయో సెక్యూరిటీ బబుల్‌ ఉండటం సహా ఫ్రాంచైజీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ క్రికెటర్లు కోవిడ్ బారిన పడుతుండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకు ముందే రాజస్థాన్ రాయల్స్‌ ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఐపీల్ ప్రారంభానికి ముందువరకు ఇంకా ఎంతమంది కరోనా బారిన పడుతారో వేచి చూడాల్సిందే.

Tags :
|
|
|

Advertisement