ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 మందికి కరోనా
By: chandrasekar Thu, 05 Nov 2020 10:40 AM
కరోనా వ్యాప్తి ఒక్కో
రాష్ట్రంలో ఒక్కో విధంగా వుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24
గంటల్లో కొత్తగా 2,477 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్
మహమ్మారి ఉధృతి మళ్లీ క్రమం పెరుగుతోంది. పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి
పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2,477
కొవిడ్-19
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మన రాష్ట్రంలో కరోనా
వైరస్ బారినపడిన వారిలో 2,701 మంది
చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు
మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,33,208 చేరింది. 8,05,026 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
దీనివల్ల ఇవాళ్టి వరకు
తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా 6744 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల
వ్యవధిలో రాష్ట్రంలో 75,465 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 83,42,265 శాపింళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తగు జాగ్రత్తలు
పాటిస్తే వీటి బారిన పడకుండా ఉండవచ్చు.