ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం... ఒక్క రోజులో 80 మంది మృతి
By: chandrasekar Tue, 11 Aug 2020 09:28 AM
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో
విలయతాండవం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7,665 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆంధ్రప్రదేశ్
వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మరో 80 మంది మరణించారు. ప్రకాశంలో 11 మంది, గుంటూరులో
10 మంది, పశ్చిమ
గోదావరిలో 9 మంది, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో
ఆరుగురు, అనంతపూర్లో
ఐదుగురు, నెల్లూరులో
ఐదుగురు, విశాఖపట్టణంలో
ఐదుగురు, విజయనగరంలో
ఐదుగురు, తూర్పుగోదావరిలో
నలుగురు చనిపోయారు.
ఇప్పటి లెక్కల ప్రకారం
ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. కరోనాను జయించి వీరిలో 1,45,636 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 87,773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,116 మంది మరణించారు. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే
గడిచిన 24
గంటల్లో 46,999 కరోనా శాంపిల్స్ను పరీక్షించారు. ఇప్పటి వరకు 25,34,304 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.