Advertisement

  • బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

By: chandrasekar Tue, 08 Sept 2020 3:46 PM

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని పాతబస్తీలో బీజేపీ మద్దతుదారులు, హిందువులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోపించారు. వారిని బీజేపీ కాపాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా వారిపై వేలెత్తి చూపిస్తే వారి చేయి కోస్తామని బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించే అంశంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.

ప్రజలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. బీజేపీ నాయకులెవరూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను కేసులు పెట్టి వేధించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags :
|

Advertisement