తాజాగా కంగనా రనౌత్ మరోమారు బాలీవుడ్పై వివాదాస్పద వ్యాఖ్యలు...
By: chandrasekar Fri, 27 Nov 2020 11:20 AM
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్
బాలీవుడ్లోని అగ్రనటీనటులు, దర్శకనిర్మాతల్ని లక్ష్యంగా చేసుకొని చాలా కాలంగా
విమర్శనాస్త్రాల్ని వేస్తూనే ఉంది. బంధుప్రీతిని ప్రోత్సహిస్తూ ఆధిపత్య ధోరణితో
ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తోంది. తాజాగా
కంగనా రనౌత్ మరోమారు బాలీవుడ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మలయాళ చిత్రం
‘జల్లికట్టు’ ఆస్కార్కు నామినేట్ అయిన సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు
తెలిపిన కంగనా భారతీయ సినిమా కేవలం నాలుగు సినీ కుటుంబాలది కాదని ఆగ్రహం వ్యక్తం
చేసింది.
ఇటీవల కాలంలో సినీ రంగంపై
ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బుల్లి దావూద్ గ్యాంగ్కు కొన్ని ఫలితాలు
చెంపపెట్టుగా మారాయి. ప్రస్తుతం మూవీ మాఫియా గ్యాంగ్లన్నీ ఇళ్లల్లో దాక్కున్నాయి.
ఆస్కార్ జ్యూరీ తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించింది. ‘జల్లికట్టు చిత్ర బృందానికి కంగ్రాట్స్' అంటూ
కంగనా ట్విట్టర్లో తెలిపింది. ఆమె వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.