కానిస్టేబుల్ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో కలకలం
By: chandrasekar Mon, 23 Nov 2020 4:01 PM
కానిస్టేబుల్
శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి
విజయవాడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పంపిన సెల్ఫీ వీడియో కలకలం
రేపుతోంది. తనకు వీఆర్ఎస్ ఇప్పించాలని సీఎం జగన్ను హెడ్ కానిస్టేబుల్
వేడుకున్నారు. ఏఆర్లో డాగ్ స్క్వాడ్ విభాగంలో శ్రీనివాసరావు పని చేస్తున్నారు.
ఇటీవల అధికారులు తనను హెడ్ క్వార్టర్స్కు మార్చారు. ఎలాంటి కారణం లేకుండా బదిలీ
చేశారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. పలు డాగ్లు అనారోగ్యంతో ఉన్నాయని చెప్పినా
అధికారులు పట్టించుకోలేదని వీడియోలో చెప్పారు. తన ఆవేదనను ఈ వీడియో లో నమోదు
చేశారు.
ఇటీవల్ల తన విషయంలో
ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలీసు జాగిలాల
పనితీరుపై ఫిర్యాదు చేసినందుకు తనను ఇబ్బందులకు గురి చేశారని శ్రీనివాసరావు ఆవేదన
వ్యక్తం చేశారు. 2005 నుంచి
విజయవాడ పోలీస్ కమిషనరేట్లో శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. 2020
ఏప్రిల్ వరకు డాగ్ హ్యాండ్లర్గా పనిచేశారు. అయితే శ్రీనివాసరావు ఆరోపణలను
ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. సాధారణ బదిలీ మాత్రమే చేశామని వెల్లడించారు. దీని
గురుంచి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.