Advertisement

  • ఆమెను ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి కాపాడిన కానిస్టేబుల్...!

ఆమెను ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి కాపాడిన కానిస్టేబుల్...!

By: Anji Thu, 24 Dec 2020 2:36 PM

ఆమెను ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి కాపాడిన కానిస్టేబుల్...!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన వెళుతూ అస్వస్థతకు గురైన భక్తురాలిని కాపాడాడు కానిస్టేబుల్. ఆమెను ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి వాహనంలో ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నాడు.

మంగి నాగేశ్వరమ్మ అనే మహిళ అన్నమయ్య మార్గంలో కాలి నడకన తిరుమలకు బయల్దేరింది. మార్గ మధ్యలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. చుట్టూ అడవి కావడంతో ఆమెను ఎవరూ గమనించలేదు.

ఇంతలో కడప జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా తిరుమలకు పాదయాత్రకు వెళ్లారు. ఆ పాదయాత్రకు సెక్యూరిటీగా వచ్చిన కడప డీటీసీకి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ భక్తురాలి పరిస్థితిని చూసి చలించిపోయారు.

అటవీ ప్రాంతం కావడం, వాహనాలను తీసుకువెళ్లే అవకాశం లేకుండాపోయింది. వెంటనే ఆమెను తన భుజాలపై వేసుకుని ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాడు. అక్కడి వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి పంపించారు.

సమయానికి అతడు స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. కానిస్టేబుల్ అర్షద్‌‌ను డీజీపీతో పాటూ అధికారులు అభినందించారు. మహిళను కాపాడటంపై ప్రశంసలు కురిపించారు.

Tags :

Advertisement