Advertisement

గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి

By: Anji Wed, 16 Sept 2020 1:05 PM

గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక కానిస్టేబుల్ చేతిలో ఉన్న గన్ మిస్ఫైర్ కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ఆదిత్య చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ చేతిలోని ఆయుధం మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా దవాఖానకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Tags :

Advertisement