Advertisement

  • దుబ్బాక కాంగ్రెస్ ఘోరఓటమిపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం

దుబ్బాక కాంగ్రెస్ ఘోరఓటమిపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం

By: Sankar Tue, 10 Nov 2020 8:40 PM

దుబ్బాక కాంగ్రెస్ ఘోరఓటమిపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం


దుబ్బాక ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. బిజెపి అభ్యర్థి రగునందం రావు స్వల్ప మెజారిటీ తో సమీప తెరాస ప్రత్యర్థి సోలిపేట సుజాత మీద విజయం సాధించారు ..అయితే ఈ దుబ్బాక ఉపఎన్నిక పోరులో కాంగ్రెస్ పార్టీ పోరాటంలో బాగా వెనుకబడింది.

దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్టు అయింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీలుగా మేమంటే మంటూ ఇంతకాలం పోటాపోటీగా ప్రచారం చేసుకున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలో తాజా ఉప ఎన్నికలో బిజెపి దూసుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత షాక్ అనే చెప్పొచ్చు.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఫలితాలపై నిరాశపడొద్దని, 2023 టార్గెట్ గా అందరం కష్టపడదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఓటమి కాంగ్రెస్‌కి కొత్త కాదు, ఇంతకన్నా ఘోరమైన సందర్భాల్లో పడిపోయిన ప్రతీసారి చాలా సార్లు కాంగ్రెస్ బలంగా నిలబడిందన్నారు.

Tags :

Advertisement