Advertisement

  • బీహార్లో ఆర్జేడీ ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్

బీహార్లో ఆర్జేడీ ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్

By: chandrasekar Wed, 11 Nov 2020 09:37 AM

బీహార్లో  ఆర్జేడీ ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్


బిహార్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమి స్పష్టమైన విజయం సాధించింది. సీఎం పదవి చేపట్టాలన్న ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్రంలో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించినా అధికారం చేపట్టే అవకాశం మాత్రం లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తంది. ఆర్జేడీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తప్పిదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పాడ్డాయి. కూటమి తరఫున ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా ఆ తర్వాత అత్యధిక స్థానాలను అంటే 70 సీట్లను కాంగ్రెస్‌‌కు కేటాయించారు. ఇక సీపీఎం 4, సీపీఐ 6, సీపీఐ (ఎంఎల్‌)కు 19 స్థానాల్లో పోటీ చేశాయి. 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లోనూ విజయం సాధించలేకపోయింది.

కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇందువల్ల కాంగ్రెస్ కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. 76 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా లాభం లేకుండా పోయింది. 72 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ 43 స్థానాల్లో గెలిచిన జేడీయూతో మరోసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిన స్థానాల కంటే తక్కువ ఇచ్చి ఉంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల పంపకం సందర్భంగా తేజస్వీ యాదవ్ ఇంకా గట్టిగా పట్టుపట్టాల్సి ఉండాల్సిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు తన సత్తాకు మించి ఎక్కువ సీట్లు ఇచ్చారనేది పలువురు అభిప్రాయం. ఈ రకంగా తేజస్వీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలకు కాంగ్రెస్ గండి కొట్టిందని చెబుతున్నారు. అటు ఎల్జేపీ, ఎంఐఎం పార్టీలు కూడా ఓటు బ్యాంకును చీల్చి మహాకూటమి విజయావకాశాలను దెబ్బ తీశాయి. ఎక్కువ స్థానాలలో గెలిచిన ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్ వల్ల విజయావకాశాన్ని పోగుట్టుకుంది.

Tags :
|
|
|

Advertisement